Thursday, April 25, 2024

Bapatla – లారీ – ఆటో ఢీ – నలుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతమాగులూరులో లారీని ఆటో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంతమాగులూరు గుంటూరు – కర్నూలు రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు నరసరావుపేట ఆర్కెస్ట్రా గ్రూప్ కి చెందిన వారిగా సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement