Wednesday, May 15, 2024

పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మూడు పెళ్లిళ్లపై పవన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని తెలిపింది. మహిళలను ఉద్దేశించి స్టెఫిని అనే పదం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలిపింది. అలాగే భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చని పవన్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. పవన్ వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని అన్నారు. మహిళలకు పవన్ కళ్యాణ్ సంజాయిషీ ఇవ్వాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement