Thursday, July 25, 2024

AP – వెల్దుర్తిలో తెలుగుదేశం కార్యకర్త హత్య – విఆర్ లోకి సిఐ, ఎస్ఐ

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ ఘటన పోలీసు వైపల్యంగా భావించి సిఐ,ఎస్ఐ లను సోమవారం విఆర్ కు పంపింది. బొమ్మిరెడ్డి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరినాథ్ చౌదరినీ వైసిపి నేతల హత్య చేసిన సంగతి విధితమే.

దీంతో ఈ ఘటనను పోలీస్ వైఫల్యంగా భావించిన ప్రభుత్వం వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ పి. చంద్రశేఖర్ రెడ్డిలను వీఆర్ నందు రిపోర్ట్ చేసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు.

కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ యు.సునీల్ కుమార్ వెల్దుర్తి నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement