Friday, May 17, 2024

లాక్ డౌన్ ఎఫెక్ట్: బోర్డర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

నేటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ఏపీ-టీఎస్ బోర్డర్ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 6 గంటల వరకు వాహనాలకు ఏపీలోకి అనుమతి లేకపోవటంతో టీఎస్ భూభాగంలో వాహనాలు నిలిచాయి. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలన్నీ రోడ్లపైనే గంటలకొద్దీ నిలిచిపోయాయి. తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ కావటంతో ఏపీలోకి సొంతూళ్లకు టీఎస్ నుంచి ప్రయాణమైన వారి వాహనాలతో రద్దీ నెలకొంది. 6 గంటల నుంచి 12 వరకు ఏపీలోకి వాహనాల అనుమతి వున్న విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement