Friday, May 17, 2024

హైకోర్టు తీర్పు జగన్ సర్కార్ కు చెంపపెట్టు: టీడీపీ

మాన్సాస్ ట్రస్ట్ నియామకంపై ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టడం హర్షణీయమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పన్నిన పన్నాగానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇన్నిసార్లు కోర్టులతో తలంటించుకొన్న పరిస్థితి లేదన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే.. మొట్టికాయలు తప్పవని సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

మాన్సాస్ ట్రస్ట్ జీవో విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు హైకోర్టులో ఏవిధంగా పాలకులకు గుణపాఠాలు ఎదురవుతున్నాయో చూస్తున్నామన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలాగానే గతంలో అనేక అంశాల్లో న్యాయస్థానం ప్రభుత్వానికి చీవాట్లుపెట్టిందన్నారు. కోట్లాది రూపాయలను లీగల్ అడ్వయిజర్లు, ఏజీపీల పేరుతో దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు ఫలితం ఈ తీర్పు అని పేర్కొన్నారు. సక్రమంగా, ధర్మబద్ధంగా సాగుతున్న హిందూధార్మిక సంస్థలను పాడుచేయవద్దని ప్రభుత్వాన్ని గోరంట్ల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement