అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. .lదీనిపై జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
జనసేనాని భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డిందని జనసేన ఆరోపిస్తోంది. హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తాం అని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు.