Tuesday, May 14, 2024

AP : ఎపిలో మాదే నిజ‌మైన ప్ర‌తి ప‌క్షం….. పురందేశ్వ‌రి..

ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని చెప్పారు. అమ‌రావ‌తిలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదనే అపోహను తొలగించాలన్నారు.

పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కేవలం ఒక తిరుపతి నియోజకవర్గంలోనే 30 వేల దొంగ ఓట్లున్నాయ‌ని ,వాటిని తొల‌గించేందుకు తాము చేసిన పోరాటం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తున్న‌ద‌ని, ఈ క్ర‌మంలో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదుగుద‌ని చెప్పారు.. పొత్తుల విష‌యం అధిష్టానం చూసుకుంటుంద‌ని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement