Friday, May 3, 2024

AP – పేదలకు కొత్త ఆసుపత్రి ‍ ‍ ‍- ప్రారంభించిన మార్కాపురం ఎమ్మెల్యే

పశ్చిమ ప్రకాశం (ప్రభన్యూస్ ప్రతినిధి) – ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలో రూ. 24 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించిన ప్రాంతీయ వైద్యశాల ను మార్కాపురం శాసనసభ్యుడు, గిద్దలూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి కె.పి.నాగార్జున రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సామాన్య, పేద వర్గాలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందు బాటులోకి తీసుకుని వచ్చిందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం క్రింద గతంలో లేని వ్యాధులను సైతం చేర్చింద న్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద వ్యయ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ వెంకటేష్, గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, గిద్దలూరు ఎంపీపీ కె.లక్ష్మీ, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్.సూరిబాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement