Sunday, May 19, 2024

AP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ అబ్దుల్ నజీర్

తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవో వీర‌బ్ర‌హ్మం, సీవీఎస్ ఓ న‌ర‌సింహ కిషోర్‌ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో లోక‌నాథం, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement