Monday, April 29, 2024

AP- ప్ర‌తి నెల లోక్ స‌భ‌ నియోజ‌కవ‌ర్గంలో జాబ్ మేళా – కేశినేని చిన్ని

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ – ఇంజ‌నీరింగ్ చదివిన విద్యార్థులకు ఐదు వేల రూపాయ‌ల వ‌లంట‌రీ ఉద్యోగం ఇచ్చి.. ఉద్యోగాలు ఇచ్చాన‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతున్నార‌ని.. ఈ సైకో జ‌గ‌న్, నెల‌కు ఐదు వేల రూపాయ‌ల జీతం ఒక కుటుంబానికి ఎలా సరిపోతుంద‌ని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు దేశం సీనియ‌ర్ నాయ‌కుడు, కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివ‌నాథ్ చిన్ని వైసీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. నిరుద్యోగ రహిత విజయవాడ పార్లమెంటును చూడటమే ప్రధాన లక్ష్యంగా టీఎన్ఎస్ఎఫ్ సహకారంతో చిన్ని మెగా జాబ్ మేళా కార్యక్రమం శుక్ర‌వారం విజ‌య‌వాడ బెంజిస‌ర్కిల్ వద్ద ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ లో నిర్వహించారు.

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం కార్య‌క్ర‌మాలు..

ఈ మెగా జాబ్ మేళా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ నిరంత‌రం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ బాట‌లోనే న‌డుస్తానన్నారు. గ‌త నాలుగేళ్లు నుంచి రాష్ట్రంలో ఒక్క జాబ్ కూడా సైకో జ‌గ‌న్ ఇవ్వ‌లేక‌పోయార‌న్నారు. హైద‌రాబాద్ లో చంద్ర‌బాబు ఐ.టి సెక్టార్ డెవ‌ల‌ప్ చేయ‌క‌ముందు ఇంజ‌నీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 800 రూపాయ‌ల‌కు కూడా ఉద్యోగం దొరికే ప‌రిస్థితి లేదన్నారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌వ‌ర్గంలో ప్ర‌తి నెల జాబ్ మేళా నిర్వ‌హిస్తామ‌న్నారు. జగ్గ‌య్య‌పేట నందిగామ నియోజ‌వ‌ర్గాల్లో ఈ నెల 22వ తేదీన‌,, మైల‌వ‌రం, తిరువూరు నియోజ‌క వ‌ర్గాల్లో ఈనెల 26వ తేదీ జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చిన్ని ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement