Wednesday, July 24, 2024

AP EAPCET Results: ఎపి ఇంజనీరింగ్ సెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్‌ నిర్వహించగా.. ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.

 ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80, 766 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాశారు. ఇంజనీరింగ్ లో 1,95,092 మంది విద్యార్ధులు అర్హత సాధించారు. మొత్తం 75.51 % ఉత్తీర్ణత పొందారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో 70,352 మంది విద్యార్ధులు అర్హత సాధించగా.. 87.11% ఉత్తీర్ణతులయ్యారు. ఇక, ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఒక్క క్లిక్ తో తమ ఫలితాలను https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు అని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది.

ఇంజనీరింగ్లో ర్యాంకులు సాధించింది వీరే..
ఫస్ట్ ర్యాంక్, మాకినేని జిష్ణు సాయి
రెండవ ర్యాంకు, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి
మూడో ర్యాంకు, భోగలాపల్లి సందీష్
అగ్రికల్చర్లో ఫస్ట్ ర్యాంక్, యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ విద్యార్ధి)
అగ్రికల్చర్లో రెండవ ర్యాంక్, పూల దివ్యతేజ
అగ్రికల్చర్లో మూడవ ర్యాంక్, వడ్లపూడి ముకేష్ చౌదరి

- Advertisement -

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

Advertisement

తాజా వార్తలు

Advertisement