Tuesday, July 23, 2024

AP BJP – తెలుగుదేశంతో పొత్తు తుదినిర్ణ‌యం అధిష్టానానిదే …. పురంధేశ్వరి

విజయవాడ: తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధినాయకత్వానిదేనని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సంద‌ర్భంగా విజయవాడ కోమల విలాస్ సెంటర్లో పేదలకు చీరలు పళ్ళు పంపిణీ చేశారు పురందేశ్వ‌రీ..అలాగే రామాలయంలో పూజలు నిర్వహించారు.. అనంత‌ర ఆమె మీడియాతో మాట్లాడుతూ, టిడిపితో పొత్తుపై తాను బిజెపి అగ్ర నాయకత్వానికి వివరిస్తానని, తమ జనసేన పార్టీ ఎన్డీఎలో కొనసాగుతుందని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను ఆమె గుర్తు చేశారు.

తాము కూడా తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతామని ఆమె చెప్పారు. ఇక చంద్ర‌బాబు ని అరెస్ట్ చేసింది సిఐడి విభాగం అని, అది రాష్ట్ర ప‌రిధిలో ప‌ని చేస్తున్న‌ద‌ని గుర్తు చేశారు.. చంద్ర‌బాబు అరెస్ట్ ను తామే మొద‌ట ఖండించామ‌ని అన్నారు. కేంద్రానికి అరెస్ట్ తో ఏ సంబంధం లేక‌పోయినా మోడీని నిందించడం త‌గ‌ద‌ని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement