Thursday, April 25, 2024

AP BJP: వైసీపీ వైనాట్ 175 నినాదంపై పురంధేశ్వ‌రి విమ‌ర్శ‌లు

Vijayawada: వైసీపీ వైనాట్ 175 నినాదంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి విమ‌ర్శించారు. విజయవాడలో ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వ‌హించారు. పురంధేశ్వరి అధ్యక్షతన నిర్వ‌హించిన‌ ఈ సమావేశానికి.. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు హాజర‌య్యారు.

ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నిక‌ల్లో దౌర్జ‌న్యం చేయ‌డానికి వైసీపీ రెడీ అయ్యింద‌న్నారు. దొంగ ఓట్ల‌తో వైనాట్ 175 అని చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా అగ్ర నాయ‌క‌త్వం కూట‌మి నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. కొంద‌రికి న‌చ్చ‌క‌పోయినా పార్టీ నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌న్నారు. ఎన్నికల్లో.. ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌పై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు జాతీయ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement