Sunday, April 28, 2024

AP – లోకేష్ కు పప్పు కుండ రిటన్ గిఫ్ట్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్

విశాఖపట్నం ఫిబ్రవరి 20….ప్రభ న్యూస్ బ్యూరో: తన తప్పులు తాను తెలుసుకోకుండా, తన తండ్రి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని గురించి చేసిన అన్యాయం గురించి ఆలోచించకుండా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తనపైన, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబం పైన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం అనకాపల్లి లో జరిగిన టిడిపి శంఖారావం సభలో లోకేష్, మంత్రి అమర్నాథ్కు కోడిగుడ్డు గిఫ్టుగా ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆయన లోకేష్ కు మట్టికుండలో ముద్ద పప్పు వండి లోకేష్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. దీనిని లోకేష్ కి పంపిస్తామని ఆయన వచ్చిన ఆయన వచ్చి తీసుకున్నా అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.

స్థానిక సర్క్యూట్ హౌస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేష్ కోసం సిద్ధం చేసిన ముద్దపప్పు కుండను మంత్రి అమర్నాథ్ ప్రదర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఉత్తరాంధ్ర ప్రజల సంప్రదాయమని, మింది గ్రామంలోని కుమ్మరులు మట్టికుండలో లోకేష్ కు ఇష్టమైన ముద్దపప్పును తయారుచేసి ఆయనకు పంపిస్తున్నామని చెప్పారు.

ఉత్తరాంధ్రను ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వదిలేసిన ఈ తండ్రి కొడుకులు సిగ్గు..లజ్జ లేకుండా ఈ ప్రాంతానికి వచ్చి తమపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని, వారికి సిగ్గు వచ్చేందుకే ఈ పప్పులో ఉప్పు, కారం కలిపామని మంత్రి అమర్నాథ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement