Saturday, July 27, 2024

AP: సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనానికి ప్రమాదం జరిగింది. సీఎం జగన్ ఇడుపులపాయలో పర్యటనకు వెళ్తుండగా జగన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి కాన్వాయ్‌లోని మరో వాహనం ఢీకొట్టింది. నెమళ్ల పార్కు నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

అయితే ఈఘటనలో సీఎం జగన్‌తో పాటు అధికారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముఖ్యమంత్రి అక్కడి నుంచి మరో వాహనంలో ఇడుపులపాయ ఎస్టేట్‌కు వెళ్లారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రెండ్రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా ఇడుపులపాయలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం కాన్వాయ్‌లో జగన్ వాహనానికి ప్రమాదం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement