Monday, April 29, 2024

AP: బైక్ ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. ముగ్గురు దుర్మరణం…

అనంతపురం, ఆగస్టు 12 : ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని
రొద్దం మండలం చిన్నకోడిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై పావగడకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా తిమ్మేనపేట క్రాస్ లో ఈ ప్రమాదం జరిగింది.

గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లినట్లుగా స్థానికుల సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement