Monday, April 29, 2024

AP : పోలీసుల ముమ్మ‌ర త‌నిఖీలు.. ప‌ట్టుబ‌డ్డ రూ. 5.23ల‌క్ష‌లు

ఏపీలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు వాహ‌నాల త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేశారు. ప్ర‌తి ఒక్క వాహ‌నాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలిస్తూ న‌గదు త‌ర‌లింపుకు అడ్డుక‌ట్ట వేస్తున్నారు. ఈనేప‌థ్యంలో ఇవాళ శ్రీ‌కాకుళం జిల్లాలో రూ.5.23ల‌క్ష‌ల న‌గ‌దును ప‌ట్టుకున్నారు.

- Advertisement -

రాజాం మండలం, పొగిరి చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారులో త‌ర‌లిస్తున్న రూ. 5.23ల‌క్ష‌ల న‌గుద‌ను సీజ్ చేశారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement