Tuesday, July 23, 2024

Accident – ట్రావెల్స్‌ బస్సు – టిప్పర్ ఢీ – ఆరుగురు సజీవదహనం

బాపట్ల జిల్లా చిన్నాగంజం నుండి హైదరాబాదుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీకొనడంతో బస్సు – టిప్పర్ లో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా దహనం అయ్యాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 42మంది ఉన్నట్లు క్షతగాత్రులు తెలిపారు. వీరిలో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ కాక మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు మరణించినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. వీరంతా బాపట్ల జిల్లా చిన్నగంజమ్ మండలం నీలాయిపాలెం వాసులుగా చెబుతున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వివరించారు.


మృతుల వివరాలు:-

- Advertisement -
  1. అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
  2. ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  3. ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  4. ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
  5. హరి సింగ్ (39) టిప్పర్ డైవర్ ఉత్తరప్రదేశ్.
  6. దావులూరి శ్రీనివాసరావు(53) s/o సుబ్బారావు గోనసపుడి గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
    మరో ఇద్దరి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మరో 32మందికి గాయాలు కావటంతో వారిని చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement