Tuesday, April 23, 2024

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన పంచాయతీ సెక్రటరీ

తడ మండలం తడకండ్రిగ పంచాయతీ సెక్రటరీ లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు, తడకండ్రిగ కు చెందిన కిలారి రామకృష్ణ అనే వ్యక్తి తన బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం పంచాయతీ సెక్రటరీ రమణయ్య ను కలిసినప్పుడు రమణయ్య 50 వేలు డిమాండు చేయడం జరిగింది, దాంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని కిలారి రామకృష్ణ సెక్రటరీ తో 40 వేలు ఇస్తానని చెప్పి ఒప్పించాడు, అనంతరం ఏసీబీ కి పిర్యాదు చేసి తిరుపతి ACB అధికారుల సహకారం తో బుధవారం రామకృష్ణ లంచం సొమ్ము 40 వేల రూపాయిలను పంచాయతీ సెక్రటరీ రమణయ్య కు ఇస్తుండగా ACB అధికారులు పట్టుకోవడం జరిగింది, రమణయ్య ను అరెస్ట్ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement