Monday, April 29, 2024

Breaking : ఒంటరి ఏనుగు హల్చల్… పంటపొలలపై స్వైరవిహారం…

కుప్పం మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది. అడవిలో నీరులేక పంటపొలలపై స్వైరవిహారం చేస్తూ పంటలను నాశనం చేస్తుంది. ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఒంటరి ఏనుగు వేకువ జామున పైపాళ్యం గ్రామానికి చెందిన మునిరత్నం రైతు కంట పడింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీస్తున్న సమయంలో కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. రైతు కుప్పం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యుల వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement