Friday, May 17, 2024

TS బీజేపీ ఫేక్ వీడియోలు… హ‌రీశ్ రావు గ‌రం గ‌రం

సిద్దిపేట – బీఆఆర్‌ఎస్‌ పార్టీపై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలో మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రా మిరెడ్డితో కలిసి బుధ‌వారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో దుబ్బాక నుంచి ఫేక్ వీడియోలు చేసి ప్రజలపై వదిలిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ చేసే అబద్ధాలు, గోబెల్స్‌ వీడియోలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. బీజేపీ అభ్యర్థి ర‌ఘ‌నంద‌న్‌పై ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. రేపు పోలీసు స్టేషన్‌లో కేసు పెడతామని స్పష్టం చేశారు.

ఇక.. వెంకట్రామిరెడ్డికి జనంఅడుగు అడుగునా నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ కోరిక మేరకు వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. వెంకట్రా మిరెడ్డి మచ్చలేని మనిషి, తెల్ల పేపరు లాంటి వ్యక్తి అని కొనియాడారు. అందరు ఆస్తులు సంపదించుకోవాలనుకుంటే అతను ఆస్తి పంచి పెడుతమంటున్నాడని పేర్కొన్నారు. అందరిలాగా డబ్బుకు విలువ ఇవ్వకుండా కేవలం ప్రజలకు సేవ చేయడానికి వచ్చారన్నారు. ఇలాంటి మంచి మనసున్న మారాజును భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement