Friday, July 26, 2024

TS : ఓటేసి తిరుగుప్ర‌యాణం… ర‌ద్దీగా మారిన జాతీయ ర‌హ‌దారి

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఓటు వేయడానికి వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా హైవేపై రద్దీ పెరిగింది. కొందరు నిన్న ఉదయాన్నే ఓటు వేసి తిరిగి ప్రయాణం కాగా, మరికొందరు ఈరోజు ఉదయం బయలుదేరారు.

- Advertisement -

దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద కూడా రద్దీ ఏర్ప‌డింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చేందుకు వీలుగా టోల్ ప్లాజాల వద్ద గేట్లు అధిక సంఖ్యలో తెరుస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే హైవేపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement