Saturday, May 18, 2024

Mumbai: కేసులు పెట్ట‌డం కూడా క్రూర‌త్వ‌మే… భార్య‌కు త‌లంటిన హైకోర్టు

ఎటువంటి ఆధారాలు లేకుండా
భ‌ర్త‌పై కేసులు బ‌నాయించ‌డం నేర‌మే

ముంబయి – భర్త, అతని బంధువులపై లేనిపోని ఆరోపణలతో కేసులు నమోదు చేసి వేధించడంపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య ఇలా వేధించడం క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.కుటుంబ న్యాయస్థానం జారీ చేసిన విడాకులను రద్దు చేసి, దాంపత్య హక్కులను పునరుద్ధరించాలన్న ఓ మహిళ వినతిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్‌ వై.జి.ఖబ్రగడే ఈ విధంగా తీర్పు ఇచ్చారు.

2004లో వివాహమైన జంట 2012 వరకు కలిసి ఉండి ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లింది భార్య. అనంతరం ఆమె భర్త, అతని తండ్రి, సోదరుడు త‌న‌ను వేధిస్తున్నారంటూ వారిపై పోలీసు కేసు పెట్టింది. అయితే, న్యాయస్థానాలు వారిని నిర్దోషులుగా ప్రకటించి ఆ కేసుల నుంచి విముక్తి ప్ర‌సాధించాయి.. దీని త‌ర్వాత తప్పుడు కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసిన భార్యతో వైవాహిక బంధాన్ని ముగించుకోవడానికి అనుమతించాలంటూ భర్త కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 2023లో విడాకులు మంజూరయ్యాయి. దీనిని సవాల్‌ చేస్తూ మాజీ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా కోర్టు విడాకులు ఇవ్వ‌డం చ‌ట్ట‌బ‌ద్ద‌మేన‌ని తీర్పు ఇచ్చింది.. అంతేకాకుండా నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌తో భ‌ర్త‌, అత్తింటి వారిపై ప‌దే ప‌దే కేసులు పెట్ట‌డం శిక్షార్హ‌మైన నేర‌మంటూ ఆమెకు న్యాయ‌మూర్తి స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement