హైదరాబాద్, (ప్రభ న్యూస్) : భారతదేశంలో ప్రముఖ నియో బ్యాంక్గా పేరు తెచ్చుకుంది ఫ్రియో. ఇప్పటికే వినియోగదారులకు ఎన్నో బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఇప్పుడు వినియోగదారులకు మరిన్ని బ్యాంకింగ్ సౌకర్యాలు అందించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈసందర్భంగా ఫ్రియో సహ వ్యవస్థాపకుడు అనుజ్ కక్కర్ మాట్లాడుతూ… ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఫ్రియో సేవ్ను ప్రారంభించామన్నారు.
దీనిద్వారా వినియోగ దారులకు అత్యుత్తమ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ను అందించాలన్న తమ లక్ష్యం నెరవేరిందన్నారు. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ లయబులిటీస్, ప్రొడక్ట్స్ అండ్ వెల్త్ మురళీ వైద్యనాథన్ మాట్లాడుతూ… ఈక్విటాస్లో తాము వినియోగదారులే ప్రప్రథ మమని బలంగా నమ్ముతామన్నారు. ఇక్కడ వినియోగదారులు సరళమైన, సరసమైన, అనుకూలమైన బ్యాంకింగ్ సేవలను ఖచ్చితంగా పొందగలరని తాము భరోసా ఇస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.