Monday, July 22, 2024

AP : రోడ్డు ప్ర‌మాదం… ఏడుగురు మృతి

ఏపీలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న అర్థ‌రాత్రి చిత్తూర్ జిల్లాలోని బెంగుళూరు ర‌హ‌దారిపై లారీ, ట్రాక్ట‌ర్‌ను ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెంద‌గా, ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మొగలిఘాట్ వద్ద చోటుచేసుకుంది.

పలమనేరు నుండి వరిగడ్డితో ట్రాక్టర్ చిత్తూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement