Wednesday, March 27, 2024

జగన్ ప్రధాని అవ్వాలని దేశం కోరుకుంటుంది – వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూనే వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కావాలని దేశంలో ఎంతోమంది కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకు జగన్ స్వర్గాన్ని చూపిస్తున్నారని ఇదే విషయమై నాకు ఎంతో మంది చెప్పారని చెప్పుకొచ్చారు. అయితే పార్థసారథి మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న జగన్ చిరునవ్వులు చిందించారు. ఇక అదే జోష్ తో వాలంటీర్లు అంతా కూడా ఈలలు,అరుపులతో గోల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement