Thursday, April 25, 2024

Telangana | ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా.. సీట్లకు రేపు వెబ్‌ కౌన్సిలింగ్‌

వరంగల్‌ ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ సీట్ల భర్తీకి కాను ఈనెల 29వ తేదివరకు రెండవ విడత వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిం చనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మొదటి విడత తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి బుధవారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 28న బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 29న గురువారం సాయంత్రం 6 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివ ర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. కెఎన్‌ఆర్‌ యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement