Tuesday, April 16, 2024

జిల్లా అధికారులతో ..మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష

విజయనగరం : కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాస పనులపై సమీక్ష చేపట్టారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణ పరిస్థితి పై సమీక్ష చేపట్టారు. భీమసింగి, సీతానగరం చక్కెర కర్మాగారాల పరిధిలో ఈ సీజన్లో రైతులు పండించిన చెరకును క్రషింగ్ కోసం పక్క జిల్లాల్లోని చక్కెర కర్మాగారాలకు తరలింపు, రైతులకు చెల్లించే ధరపై సమీక్ష. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మేల్యేలు బొత్స అప్పల నరసయ్య, కడు బండి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, ఎస్.పి. దీపిక, జె.సి. మయూర్ అశోక్, ఆర్.డి.ఓ.లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement