Thursday, April 25, 2024

TS: అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయం.. గొర్రెల పంపిణీతో యాదవుల జీవితాల్లో వెలుగులు

వీణవంక (ప్రభ న్యూస్): అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం మామిడాలపల్లి లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో కలిసి యాదవ సమ్మేళనంలో పాల్గొని ప్రభుత్వ పథకాలను వివరించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవుల అభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ చేసి వారి జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశంలో మొదటి స్థానంలో ఉందని, ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement