Thursday, April 25, 2024

టీడీపీ నేత కాగిత వెంకట్రావు కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే, చికిత్స పొందుతూ గుండె పోటు రావడంతో గురువారం మృతి చెందారు. సాయంత్రం మూడు గంటలకు ఆయన స్వగ్రామమైన నాగేశ్వరరావు పేటకు భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు. కృష్ణాజిల్లాకి చెందిన వెంకట్రావు, టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పెడన నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పలు దఫాలు ఎన్నికైయ్యారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ‌గా పనిచేశారు. వెంకట్రావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement