Saturday, March 23, 2024

నందికొట్కూరు టీడీపీ నేతల నిరసనలు

నందికొట్కూరు (ప్రభ న్యూస్): ఏపీ అసెంబ్లీలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని అవమానించేలా ప్రవర్తించిన వైసిపి నేతల వ్యాఖ్యలపై టీడీపీ ఆందోళన బాట పట్టింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి నాయకులు అందరూ కలిసి నందికొట్కూరు పట్టణంలో నిరసన తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబును అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అవమానించారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే అందరూ చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎం పీపీ ప్రసాద్ రెడ్డి, జయసూర్య, పలుచాని మహేశ్వర రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, భాస్కర్ రెడ్డి, మహేష్ నాయుడు, గిరీశ్వర్ రెడ్డి, ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement