Tuesday, March 26, 2024

శంభీపూర్ కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

కుత్బుల్లాపూర్, ( ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శంబీపూర్ రాజుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, టిఆర్ ఎస్ నేతలు, ఎమ్మెల్సీ రాజు చేత సహాయం పొందిన ప్రజానీకం, ఆయన అభిమానులు శంబీపూర్ వ‌ద్ద‌కు క్యూ కట్టారు. ఉదయం నుండే రాజు స్వగృహానికి విచ్చేసి తమ నేతకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా కానుకలు ఇచ్చి తమ వ్యక్తి గతాన్ని చాటుకుంటున్నారు. ఫలితంగా శంబీపూర్ వ‌ద్ద‌ తిరునాళ్ళను తలపిస్తుంది.

ప్రగతినగర్ 2వ కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఇటీవల ఐటెక్స్ లో జరిగిన కార్యకర్తల శిబిరం విజయవంతం కావడం, ఇందులో ప్రముఖ పాత్ర పోషించిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును మంత్రి కేటీఆర్ ఆత్మీయంగా హత్తుకుని తన కెమెరాలో సెల్ఫీ బంధించిన చిత్రాన్ని బహుకరించారు. దీంతో అక్కడున్న వారంతా జయహో రాజన్న అంటూ నినాదాలు చేయడం, ఫ్యూచర్ మినిస్టర్ అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తానికి గత రెండు రోజులుగా శంభీపూర్ గ్రామం టీఆర్ఎస్ నేతలతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు భాస్కరచారీ, యూత్ ప్రెసిడెంట్ దివాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ధర్మేందర్, చంద్రయ్య జలగం, దుర్గ, ఓం నాథ్ రెడ్డి, పవన్ ప్రదీప్, మల్లి, సాంబశివ, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement