Thursday, April 25, 2024

సామాన్యుడికి ఊరట..తగ్గుతున్న చమురు ధరలు

దేశంలో చమురు ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వరుసగా ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే, చాలా రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ.17 పైసలు, డీజిల్ పై రూ.18పైసలను కేంద్రం తగ్గించింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.23 ఉండగా, డీజిల్ ధర రూ.96.66కు.చేరింది.

ఇది కూడా చదవండి: ఉప ఎన్నికల బరిలో మమతా.. కంచుకోటలో అడుగు!

Advertisement

తాజా వార్తలు

Advertisement