Friday, March 29, 2024

కరోనా ఎఫెక్ట్:భారత ప్రయాణికులపై న్యూజిలాండ్ ఆంక్షలు

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్న క్ర‌మంలో ఇత‌ర దేశాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించాల‌ని న్యూజిలాండ్ నిర్ణ‌యించింది. ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. భార‌త ప్ర‌యాణికుల‌తో పాటు న్యూజిలాండ్ పౌరుల‌పై తాత్కాలికంగా నిషేధం విధించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధ‌న ఏప్రిల్ 11వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement