Wednesday, April 24, 2024

కుంజా బొజ్జి మృతికి కెసిఆర్ సంతాపం..

హైదరాబాద్‌ : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుంజా బొజ్జి గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. కుంజా కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎపిలోని వరరామచంద్రపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి, ఉమ్మడి రాష్ట్రంలో 1985, 89, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మచ్చలేని రాజకీయ నేతగా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ గిరిజనుల మనసుల్లో బొజ్జి చిరస్థాయిగా నిలిచిపోయారు. 95వ ఏట అనారోగ్యంతో నేటి ఉద‌యం భ‌ద్రాచ‌లం హాస్ప‌ట‌ల్లో ఆయ‌న క‌న్నుమూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement