Wednesday, April 24, 2024

మ‌రోసారి ఎమ్మెల్సీ బ‌రిలో క‌విత

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాజాగా మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కూత‌రు క‌విత మ‌రోసారి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్‌ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది.

అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4తో ముగియనుండ‌గా టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కవిత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. మొన్న‌టి దాకా క‌విత రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌బోతుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ మళ్లీ నిజామాబాద్‌ నుంచే ఆమె స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలోకి దిగ‌నున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement