Friday, April 19, 2024

ఢిల్లీకి జగన్ పయనం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలవరం నిధులు ,వ్యాక్సినేషన్ ఇతర అంశాలపై సీఎం జగన్ వారితో చర్చించనున్నారట.

అంతేకాకుండా కుదిరితే ప్రధాని అపాయింట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement