Thursday, April 25, 2024

ఐశ్వర్యాన్నిచ్చే మార్గశిర లక్ష్మీవార వ్రతం

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం…’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే…’ అంటూ అమ్మ స్తుతులే. శ్రీ మహా విష్ణువుకు ప్రీతి పాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే! మార్గశిర మాసం గురువారాలలో తనను నియమనిష్ఠలతో కొలిచిన వారికి వరాలను ప్రసాదిస్తుంది మహాలక్ష్మి. ఈ మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే పూజిస్తారో సంవత్స రమంతా వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుంది.
ఐదువారాల అద్భుత వ్రతం…

మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మార్గశిర శుద్ధ పాడ్యమి గురువారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమయి, మార్గశిర బహుళ చతుర్దశి గురువారంతో అయిదు గురువారాలు మార్గశిరంలోనే వచ్చాయి.
ముందుగా ప్రాత:కాలాన నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముంగిట రంగ వల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహా లక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహంచాలి. ‘హరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం’ అంటూ అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. ”ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహ తన్నో లక్ష్మీ: ప్రచోద యాత్‌” అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ మంత్రపుష్పాన్ని సమ ర్పించాలి. అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని చదువుకో వాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి.
అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సంద ర్భంగా పులగం నివేదన చేయాలి. రెండవవారం అట్లు, తిమ్మనం మూడో వారం అప్పాలు, పరమాన్నము నాలుగోవారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి. ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి.
ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.
నియమనిష్ఠలు కీలకం

గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
మార్గశి ర లక్ష్మీవార వ్రత కథ

పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తు కొమ్మని చెబుతూ కొంచెం బెల్లం యిచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైద్యం పెట్టే ది. కొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి తాను తయారు చేసు కున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. అత్తింట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. తల్లి దరిద్రమును భరించ లేక కొడుకును నీ అక్క ఇంటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని పంపింది. సుశీల ఇంటికి వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. ఒక కర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి ఇచ్చింది. ఆ కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలేశాడు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. కొంత కాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితి తెలుసుకున్నది. ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమధ్యలో దాహంవేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపో యారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్న ట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సాయంసమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అంది. అలాగే అని పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి అంది. అప్పుడు జరిగినది చెప్పింది. రెండవ వారంపిల్లలకు తలకి నూనె రాస్తూ తాను రాసు కుంది. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్త గావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయ లేకపోయినది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత్తగావుండమని చెప్పి సుశీల తల్లిని ఒకగోతిలో కూర్చో బెట్టినది. పని అయినతరువాత వచ్చి తల్లిని స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిల వగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయిం చి వ్రతం చేయించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లి పోయింది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా… నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. తన తల్లిని క్షమించమని ప్రార్ధిం చింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది. నిష్ఠగా తల్లిచే నోము చేయించింది. కథా అక్షింతలు వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి కడకు విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు.

  • డా|| దేవులపల్లి పద్మజ, 9849692414
Advertisement

తాజా వార్తలు

Advertisement