Thursday, April 25, 2024

తానే చంపేసి మిస్ ఫైర్ అన్నాడు

విజయవాడ మిస్ ఫైర్ ఘటనలో అసలు నిజం బయటకు వచ్చింది. భార్య ను హోంగార్డ్ వినోద్ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్ రత్నప్రభ కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే తాకట్టు పెట్టిన బంగారంను విడిపించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఈ సమయంలో వినోద్ తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చిచంపాడు. మొదట తుపాకి మిస్ అయిందని అందుకే తన భార్య చనిపోయిందని డ్రామా ఆడాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.

బంగారు నగలు తాకట్టు విషయంలో గొడవ జరిగి భార్య పై ఫైర్ చేయడం వల్ల ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. తాకట్టు పెట్టిన తాడును విడిపించాలని ఒత్తిడి చేసినందు వల్లే ఈ ఘటన జరిగిందని…హోంగార్డు మీద మర్డర్ కేసు పెట్టమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement