ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఎస్ఈసీ డివిజన్ బెంచ్లో వేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో గురువారం నాడు యథావిథిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించవద్దని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement