Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

బంగారానికి ఉన్న విలువ ప్రపంచంలో మరేదానికి లేదు. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 240 పెరిగి రూ. 43,750 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెరిగి రూ. 47,730 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా నమోదయ్యాయి. కిలో వెండి రూ. 64,800 నమోదయింది.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో డ్రగ్స్‌ ఆనవాల్లే కనిపించకూడదు: సీఎం జగన్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement