Wednesday, April 24, 2024

సినీ రంగంలో ధోని బిజీ.. సౌతిండియాకు విస్తరించేందుకు ప్లాన్​

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప‌లికిన‌ తర్వాత ఎంఎస్ ధోని త‌న‌ కొత్త వెంచర్‌లతో బిజీగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ ల‌ నుండి రిటైర్ అయ్యాడు ధోని. కానీ, ఇప్పటికీ అత్యంత విజయవంతమైన IPL ఫ్రాంచైజీలలో ఒకటైన‌ చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అత్యంత ఇష్టపడే క్రికెటర్ లలో ధోని ఒకడు. కెప్టెన్ కూల్ తెలివితేటలు.. విజయాలను క్రీడా మైదానంలో, వెలుపల ఎల్లప్పుడూ ప్రశంసిన్తూనే ఉంటారు.

కాగా, ఇప్పుడు అతను తన సంస్థ ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్’ ని దక్షిణాది చిత్ర పరిశ్రమకు విస్తరించాలని ఆలోచిస్తున్నాడు. ఇది ధోనీ, అతని భార్య సాక్షి ఇద్దరికీ చెందినది. ఈ ప్రొడక్షన్ హౌస్ ‘‘రోర్ ఆఫ్ ది లయన్’’, ‘‘బ్లేజ్ టు గ్లోరీ’’ & ‘‘ది హిడెన్ హిందూ ’’వంటి చిన్న-స్థాయి డాక్యుమెంటరీలను నిర్మించింది.

ఇప్పుడు MS ధోని ఈ ప్రొడక్షన్ హౌస్‌ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తమిళం, తెలుగు & మలయాళం మూడు భాషల్లో సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చర్యతో ధోని భారీ ఎత్తున సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే, CSKతో ఉన్న అనుబంధం కారణంగా ధోనీకి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతను దక్షిణాది నుండి టాప్ స్టార్స్‌తో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement