Thursday, April 18, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పై అవగాహన ర్యాలీ..

తర్లుపాడు : కరోనా నివారణకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి అని 45 సం.లు నిండిన ప్రతీ ఒక్కరు టీకా వేయించుకోవాలని ఏపియం దుగ్గెం పిచ్చయ్య తెలిపారు మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామ పురవీధుల్లో స్వయం రక్ష కరోనా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీని వైయస్‌ఆర్‌ క్రాంతిపధం ఆధ్వర్యంలో పిచ్చయ్య నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి బస్టాండ్‌ సెంటర్‌లో పిచ్చయ్య మాట్లాడుతూ కరోనా వ్యాధిపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కును ధరించి భౌతికదూరాన్ని పాటించాలని, జలుబు, తుమ్మలు, జ్వరం ఉంటే వైద్యున్ని సంప్రదించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement