Saturday, April 20, 2024

Hyderabad | స్పా, మసాజ్​ పార్లర్​ పేరుతో ‘ఆ పని’.. దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్​లో స్పా, మసాజ్​ సెంటర్​ పేరుతో ‘ఆ పని’ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు దాడులు జరిపారు. కుత్బుల్లాపూర్‌లోని ఎన్‌ఎస్‌ వెల్‌నెస్‌ ఎస్‌పీఏ సెంటర్‌పై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు, కస్టమర్‌లు, ముగ్గురు మహిళా మసాజర్లను అరెస్టు చేశారు.

నిర్ధిష్ట సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ జి. ప్రశాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం స్పా​ సెంటర్​ ఆర్గనైజర్ అశ్విని నడుపుతున్న మసాజ్ పార్లర్‌పై దాడి చేసింది. భవన యజమాని రామకృష్ణ స్పా సెంటర్‌ను అక్రమంగా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement