Saturday, April 13, 2024

మ‌ళ్లీ భీష్మ కాంబో… క్లాప్ కొట్టిన చిరంజీవి

నితిన్‌ కెరీర్‌ లో మంచి విజయం సాధించిన చిత్రాల్లో భీష్మ ఒకటి. ఈ సినిమా కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ అవుతోంది. వెంకీ కుడుముల, నితిన్‌, రష్మిక మందన ఈ ముగ్గురి కాంబినేషన్‌ లో మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కి సంబధించిన మంచి సందేశం ఇచ్చింది. కొత్త సినిమా ప్రకటన వీడియోలో వెల్లడించారు.మరింత వినోదాత్మకంగా, అడ్వంచరస్‌ గా ఉంటుంది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మైత్రీ మూవీస్‌ ఈ ప్రాజెక్ట్‌ లో చేరడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాల‌ను నేడు నిర్వ‌హించారు.. నితిన్,ర‌ష్మిక ల మ‌ధ్య తొలి స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.. ద‌ర్శకులు బాబీ, గోపీ చంద్ లు కెమెరా ఆన్ చేయ‌గా, ద‌ర్శ‌కత్వం వ‌హించారు.. ఈ కార్య‌క్ర‌మంలో హ‌నురావి పూడి, బుచ్చిబాబ స‌న‌, త‌దిత‌రులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement