Tuesday, April 16, 2024

Breaking : చెయ్యేరు న‌దీ ప్ర‌వాహంలో 14మృత‌దేహాలు..ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి…

ప‌లు రాష్ట్రాల‌ను భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. కాగా క‌డ‌ప జిల్లాల్లో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. జిల్లాలోని చెయ్యేరు నది.. భారీ వరదలతో పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో ఆ నదీ ప్రవాహంలో ఏకంగా 26 మంది గల్లంతయ్యారు. అయితే ఇందులో 14 మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. పూల పుత్తూరులో పది మంది గల్లంతు కాగా… ఎగువ అలాగే దిగువ మందపల్లిలో ఏకంగా 13 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. అయితే 26 మంది పూల పుత్తూరు, మందపల్లి కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పూజారి రామ్మూర్తి కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఇప్పటి వరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభ్యమైందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement