Thursday, April 25, 2024

Breaking : టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు వీరే..

ఎమ్మెల్యే కోటాలో టీఆర్ ఎస్ఎ మ్మెల్సీ అభ్య‌ర్థులు ఖ‌రార‌య్యారు. ఈమేరకు సీఎం కేసీఆర్ వీరి అభ్యర్థిత్వాన్ని డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో న‌లుగురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులను ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరిలో కడియం శ్రీహ‌రి, గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ర‌వీంద‌ర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలోనే కరీంనగర్ నేత కౌశిక్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌పై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. వారి పేర్ల‌ను ఈరోజు సాయంత్రం లోపు వెల్లడించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. వీరంతా రేపు (మంగళవారం) నామినేష‌న్లు వేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement