Thursday, March 28, 2024

నేటి బంగారం, వెండి ధ‌ర‌లు

బంగారం ధ‌ర‌లు రోజుకోలా ఉంటున్నాయి. నేడు బంగారం ధ‌ర‌లు కాస్త పెరిగాయి దీనికి తోడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 49,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 పెరిగి రూ. 54,380కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుదలలో బంగారంతోొ పోటీ పడుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1000కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.75,200 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వచ్చే రెండు నెలలు క్రమంగా వివాహ ముహూర్తాలు ఉండటంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement