Saturday, April 20, 2024

కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు – బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్

పెద్దపల్లి – బిఆర్ఎస్ తిరుగులేదు…కేసీఆర్‌ కుఎదురులేదనీ రాష్ట్ర మెడికల్ ఇన్ఫస్టక్చర్ చైర్మన్, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలియజేశారు. పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బిఅర్ఎస్ పార్టీ ఒక కుటుంబం అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు వివరించాలని, ఎప్రిల్ 26 తేదీ వరకు గ్రామ గ్రామాన సమీక్షలు పెట్టీ చర్చించాలన్నారు. మళ్ళీ బీ ఆర్ ఎస్ అధికారం లోకి వస్తుందని గమనించిన ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ఎక్కడికక్కడ వాటిని తీప్పి కొడుతూ జరిగిన జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఆసరా ఫించన్ ద్వారా లబ్ధిదారులు 2 వేల ఫించన్ ఇస్తుంటే మోడీ స్వంత రాష్ట్ర లో 750 మాత్రమే ఫించన్ ఇస్తున్నారన్నారు. 400 ఉన్న గ్యాస్ ధరను 1170 చేసి సామాన్యుల నడ్డి విరుస్తుంది మెాడి ప్రభుత్వం అన్నారు. హనుమంతుని గుడి లేని ఊరులేదు, కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదన్నారు . గ్రామ స్థాయి లో ప్రతి కార్యకర్త జరిగిన జరుగుతున్న అభివృద్ధి పై ప్రజలకు వివరించాలని ప్రతి కార్యకర్త వంద మంది తో సమానం అన్నారు. ఎప్రిల్ 25 లోపు జిల్లా వ్యాప్తంగా సమ్మేళనాలు పూర్తి చేసుకోవాలనీ, ఏప్రిల్ 27 న పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా చేయాలన్నారు. జూన్ 1 న అమరవీరుల జ్యోతి ప్రారంభం కానుందనీ జూన్ 2 న రాష్ట్ర ఆవిర్భావం రోజున సంబరాలు ఘనంగా జరపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement