Wednesday, April 24, 2024

అసెంబ్లీకి స్కూల్ యూనిఫాంలో వెళ్లిన ఎమ్మెల్యేలు

పాఠ‌శాల విద్యార్థుల‌కు యూనిఫాం అంద‌జేయ‌క‌పోవ‌డంపై కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై 8 నెలలవుతున్నా పాఠశాల విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపించారు. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందజేయకపోవడంపై డీఎంకే ఎమ్మెల్యేలు పాఠశాల యూనిఫాం ధరించి నిర‌స‌న‌గా అసెంబ్లీకి వచ్చారు. దాంతో పాటు ఐడీ కార్డులు ధరించి, సైకిళ్లపై పుదుచ్చేరి శాసనసభా హాలుకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement